Friday, March 29, 2024

ప్రజలకు మరింత చేరువలో ప్రభుత్వ వైద్యం : తలసాని

ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్ పేటలో మంత్రి తలసాని డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పేదలపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు అని మంత్రి తెలిపారు. వేలాది రూపాయల విలువైన పరీక్షలు ప్రభుత్వాస్పత్రిలో ఉచితమన్నారు. ఆహారం కోసం రోగి సహాయకుల ఇబ్బందులు తొలగించేందుకు 18 ప్రధాన ఆస్పత్రుల్లో రూ.5ల భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement