Tuesday, March 26, 2024

బాంబు పేల్చిన గ్రేట‌ర్ మేయ‌ర్ – బిజెపి కార్పొరేట‌ర్స్ ట‌చ్ లో ఉన్నారంటూ కామెంట్..

హైదరాబాద్‌: నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు తనతో టచ్‌లో ఉన్నారని గ్రేట‌ర్ మేయర్‌ విజయలక్ష్మి తెలిపారు. వారు గెలిచిన డివిజన్ల అభివృద్ధికి తాను కృషి చేస్తానని మేయర్‌ పేర్కొన్నారు. బిజెపి గెలిచిన డివిజ‌న్ ల‌లో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌క‌న‌ప‌ర‌చ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.. కాగా,ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో కౌన్సిల్ సమావేశం వర్చువల్ విధానంలో నిర్వ‌హించ‌నున్నామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో క‌రోనా సెకండ్ వేవ్ ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాల్సిందిగా న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement