Thursday, April 25, 2024

HYD : నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ పోలీసులు నకిలీ ధ్రువపత్రాలతో స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని హయత్‌నగర్, ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.4 కోట్ల విలువైన నకిలీ ధ్రువపత్రాలు, కారు, 9 మొబైల్స్, స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ముఠా చాలా స్థలాలను నకిలీ ధ్రువపత్రాలతో అమ్మేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement