Saturday, April 20, 2024

జనప్రియ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం..

హైద‌రాబాద్ రాజేంద్రనగర్‌లో బుధవారం తెల్లవారుజామున హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్ లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. అపార్ట్ మెంట్ లోని నాలుగో అంతస్తులోని ఓ ప్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ప్లాట్‌మొత్తానికి విస్తరించడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు బయటకు పరుగులు తీశారు. వెంట‌నే పోలీసులకు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను ఆరా తీశారు. ఫైర్ సిబ్బంది వ‌చ్చి మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ప్లాట్‌ పూర్తిగా దగ్ధమయింది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. కాగా, షార్ట్‌ సర్య్కూట్‌తోనే మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement