Tuesday, March 26, 2024

వీడియో: రాజేంద్రనగర్‌లో కారులో మంటలు.. కాలి బూడిదైన కారు

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరోసారి ఓ కారులో మంటలు చెలరేగాయి. అత్తాపూర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద సోమవారం నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అప్రమత్తమైన వెంటనే కారును నిలిపివేయించారు. కారు నడుపుతున్న మహిళతో పాటు పిల్లలను దింపివేశారు. కాసేపట్లోనే కారులో మంటలు వ్యాపించి దగ్ధమైంది. అయితే కారులో మంటలకు చెలరేగడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. స్థానికులు వెంటనే అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. మామిడిపల్లి నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. కాగా మూడురోజుల క్రితం అత్తాపూర్‌లో ఓ కారులో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement