Thursday, April 25, 2024

అందుబాటులోకి ఎర్రగడ్డ ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జి.. ప్రారంభించిన మంత్రి తలసాని

ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ప్రారంభించారు. సుమారు రూ.5 కోట్ల వ్యయంతో స్టేర్ కాస్, లిఫ్ట్ గా, ఎస్కలేటర్, షెల్టర్ వాక్ వేతో పాటు మెరుగైన లైటింగ్, భద్రత సౌకర్యాలతో దీనిని నిర్మించారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు రూ.75.65 కోట్ల అంచనా వ్యయంతో 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. అందులో ఇప్పటి వరకు 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలినవాటి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement