Thursday, April 25, 2024

కాలనీల సర్వతోముకాభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే వివేకానంద్

కాలనీల సర్వతోముఖాభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని ఫేస్-1 సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ నూతన సంఘాన్ని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… సంక్షేమ సంఘం సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని.. వాటి పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్, కాలనీ ప్రెసిడెంట్ బిజిలి కృష్ణ, జెనరల్ సెక్రెటరీ బాలరాజు, ట్రెజరర్ చందర్ రావు, అడ్వైజర్స్ కేవీ రమణ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, బిక్షపతి, రామ్ విలాస్ సింగ్, మహిళా నాయకురాలు పద్మజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement