Tuesday, April 23, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్ లో రూ. కోటికి పైగా జరిమానా..

హైదరాబాద్ : నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ‌ కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో మార్చిలో నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1917 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 58 మందికి 2 రోజుల నుంచి 9 రోజుల వరకు జైలు శిక్షను విధించింది. మిగతా 1859 మంది నుంచి రూ. 1,99,56,300 జరిమానా వసూలు చేశారు. అతిగా తాగి, ఎక్కువసార్లు పట్టుబడ్డ వారిలో ముగ్గురికి 9 రోజులు, 10 మందికి 7 రోజులు, 25 మందికి 5 రోజులు, 20 మందికి 2 రోజుల జైలు శిక్షను కోర్టు విధించింది. మరో 14 మందిని కోర్టు సమయం ముగిసేవరకు నిల్చోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement