Thursday, April 25, 2024

స్పోర్ట్స్ మీట్ లో సందడి చేసిన డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి

నిత్యం ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఆటవిడుపులో భాగంగా ఆడిపాడారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో విక్టరీ ప్లే గ్రౌండ్ లో మూడురోజుల పాటు నిర్వహించబోయే కార్పొరేటర్ల స్పోర్ట్స్ మీట్ 2023 కార్యక్రమం గురువారం సందడిగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్పొరేటర్లు ఓకే వేదికపై వివిధ పోటీల్లో పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి తోటి మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి సరదాగా క్యారమ్స్, చదరంగం ఆడారు. అలాగే ఉత్సాహంగా షటిల్ ఆడారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా అక్కడి ఏర్పాట్లను ఆమె పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement