Thursday, March 28, 2024

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మార్‌ ఏర్పాటు..

జవహర్‌నగర్‌ : జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ 20వ డివిజన్‌ కార్పోరేటర్‌ కుతాడి సాయి కుమార్‌ ఆధ్వర్యంలో నూతన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మార్‌ ఏర్పాటు చేసి లైన్‌మెన్‌ శ్రీనివాస్‌ నాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయి కుమార్‌ మాట్లాడుతూ డివిజన్‌లోని ప్రజలు విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలంటూ పలుమార్లు కోరారు. డివిజన్‌ ప్రజల కొరిక మేరకు తక్షణమే ఏర్పటు చేయాలని విద్యుత్‌ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డివిజన్‌ ప్రజల సమస్యను తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని వారన్నారు. నూతన ట్రాన్స్‌ఫార్మార్‌ ఏర్పాటుకు సహాకరించిన లైన్‌మెన్‌ శ్రీనివాస్‌ నాయక్‌ను శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఖాజా, చోటు, అస్లాం, డివిజన్‌ ప్రజలు , మహిళలు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement