Tuesday, March 26, 2024

పంద్రాగ‌స్టు వేడుకలపై సీఎస్ సమీక్ష

స్వాతంత్ర్య దినోత్స‌వ‌ సందర్భంగా పంద్రాగ‌స్టు రోజున గోల్కొండ కోట‌పై సీఎం కేసీఆర్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు సీఎస్ సోమేశ్ కమార్ తెలిపారు. ఆగ‌స్టు 15న గోల్కొండ కోట‌పై నిర్వ‌హించే స్వాతంత్ర్య దినోత్స‌వ‌ వేడుక‌ల‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స‌మీక్ష నిర్వ‌హించారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర సంస్కృతిని ప్ర‌తిబింబించేలా క‌ళారూపాలు ఉండాల‌ని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement