Thursday, April 25, 2024

HYD: కుంగిన రోడ్డు.. ముగ్గురికి గాయాలు

ఉన్నట్టుండి ఒక్కసారిగా 10 అడుగుల మేర రోడ్డు కుంగిపోవడంతో.. టిప్పర్ అందులో ఇరుక్కుపోయి ముగ్గురికి గాయాలైన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని హిమాయత్ నగర్ లో స్ట్రీట్ నెం.5లో రోడ్డు కుంగిపోయింది. మట్టి లోడ్ తో వెళ్తున్న టిప్పర్ అందులో కూరుకుపోయింది. ట్రిప్పర్ వెళ్తున్న సమయంలో రోడ్డు కుంగిపోవడంతో ట్రిప్పర్ డ్రైవర్ కు, మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. కుంగిన రోడ్డుపక్కనే నాలా ప్రవహిస్తోంది. రోడ్డు కుంగిపోవడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement