Friday, March 29, 2024

క్రైస్తవ స్మశానవాటిక అభివృద్ది కమిటీ..

పాతబోయిన్‌పల్లి : 119 పాతబోయిన్‌పల్లి డివిజన్‌ హస్మత్‌ పేట్‌ క్రైస్తవ స్మశాన వాటిక నూతన అభివృద్ది కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా ప్రముఖ సామాజికవేత్త పాస్టర్‌ డాక్టర్‌ అందె సుధాకర్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు స్థానిక కార్పోరేటర్‌ ముద్దం నర్సింహ్మయాదవ్‌, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాదవరం క్రిష్ణారావులను వారు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులను ఎమ్మెల్యే, కార్పోరేటర్‌ లు అభినందించారు. అనంతరం కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ సుధాకర్‌ మాట్లాడుతూ హస్మత్‌ పేట్‌లో క్రైస్తవ స్మశానవాటిక అభివృద్ది కోసం నూతన కమిటీ రిజిష్ట్రేషన్‌ చేయించామన్నారు. ఈ కమిటీ ద్వారా స్మశాన వాటిక అభివృద్దితో పాటు క్రైస్తవ కుటుంబాల సంక్షేమానికి కూడా కృషి చేస్తామని ఆయన అన్నారు. కమిటీ ప్రధాన కార్యదర్శిగా పాస్టర్‌ కెసతీష్‌, ఉపాధ్యక్షులుగా పాస్టర్‌ సుధాకర్‌, సంయుక్త కార్యదర్శిగా జాన్‌, జేమ్స్‌, పరమేష్‌, కవిత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement