Wednesday, April 24, 2024

మినీ పుర పోరుకి నోటిఫికేషన్ విడుదల – 30న పోలింగ్, మే 3న కౌంటింగ్..

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో మినీ పుర‌పోరుకు స‌ర్వం సిద్ధ‌మైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్లు, అచ్చంపేట‌, సిద్దిపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. రేప‌ట్నుంచి ఈ నెల 18వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. 19న అభ్య‌ర్థుల నామినేష‌న్ ప‌త్రాల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రితేదీ ఈ నెల 22.

ఆ మూడు మున్సిపాలిటీల‌కు చైర్‌ప‌ర్స‌న్ల రిజర్వేష‌న్లు ఖ‌రారు
జ‌డ్చ‌ర్ల‌, న‌కిరేక‌ల్, కొత్తూరు చైర్‌ప‌ర్స‌న్ల రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు అయ్యాయి. జ‌డ్చ‌ర్ల – బీసీ మ‌హిళ‌, న‌కిరేక‌ల్ – బీసీ జ‌న‌ర‌ల్, కొత్తూరు – జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు కేటాయించారు. రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో అధికారులు లాట‌రీ తీశారు. ఇక వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌తో పాటు సిద్దిపేట మున్సిపాలిటీకి రిజ‌ర్వేష‌న్ల జాబితాను సంబంధిత అధికారులు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement