Thursday, April 25, 2024

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ..

కవాడిగూడ : ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని వివిధ బస్తీలకు చెందిన అర్హూలైన వారికి సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్‌ నియోజకవర్గం శాసన స భ్యులు ముఠా గోపాల్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. దేశంలో తెలంగాణ అభివృద్దిలో నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని, ఆ ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. సిఎం కెసిఆర్‌ నిరుపేదలకు అండగా ఉంటున్నారన్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్నన్ని అభివృద్ది, సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు జరగడం లేదని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నేతలు ముఠా జయసింహ్మా తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement