Thursday, April 25, 2024

పేదలకు ఆపన్న హాస్తం-సిఎం రిలిఫ్‌ ఫండ్

షాద్‌నగర్‌ : పేద ప్రజలందరు ఆరోగ్యంగా ఉండాలని వారికి ఆపత్కాలంలో ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నటరాజన్‌ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ పరిధిలోని 22వ వార్డుకు చెందిన అర్జున్‌ యాదవ్‌కు సి ఎం సహాయ నిధి ద్వారా మంజురైన రూ. 22వేలు చెక్కును మున్సిపల్‌ వౖౖెస్‌ చైర్మన్‌ నటరాజన్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రవి యాదవ్‌, బాలు యాదవ్‌, నడికూడ అశోక్‌ యాదవ్‌, శివాజీ నాయక్‌, నడికూడ సంతోష్‌ యాదవ్‌, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement