Saturday, April 20, 2024

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం..

కవాడిగూడ : ముఖ్యమంత్రి సహాయానిధి పేదల పాలిట వరంగా మారిందని ముషీరాబాద్‌ నియోజకవర్గం శాసనసభ్యులు ముఠా గోపాల్‌ అన్నారు. నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్‌కు చెందిన పలువురు లబ్దిదారులకు గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ముఠాగోపాల్‌ మాట్లాడుతూ సిఎం కేసిఆర్‌ పేదల పక్షపాతి అని, దేశంలో ఎక్కాడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజా సంక్షేమానికి పెద్దపీఠ వేస్తున్నారన్నారు. ఆరున్నర సంవత్సరాల టిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక ప్రథకం ద్వారా లబ్ది చేకూరిందని ఆయన అన్నారు. నిరుపేదలు ప్రభుత్వ పథకాలు ఉన్నాయనే ఎంతో దైర్యంగా తలెత్తుకొని జీవిస్తున్నారని, అందుకు తాను ఎంతో గర్వపడుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు ముఠా జయసింహ్మా, వల్లాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement