Thursday, April 25, 2024

క్రిస్మస్ వేడుకల నిర్వహణ పై మంత్రి తలసాని సమావేశం

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పండుగలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. రేపు క్రిస్టియన్‌ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. క్రిస్మస్‌ వేడుకల నిర్వహణపై పలు క్రిస్టియన్‌ సంస్థలు, పాస్టర్లతో మంత్రి తలసాని మారేడ్‌పల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్లకు గతంలో ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు క్రిస్టియన్‌ భవనం నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇందుకోసం ఉప్పల్‌ భగాయత్‌లో ప్రభుత్వం 2 ఎకరాల స్థలం కేటాయించిందని గుర్తు చేశారు. సోమవారం ఈ భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేపట్టనున్నట్లు చెప్పారు. అదేవిధంగా క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ నెల 13 వ తేదీన నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ ఉంటుందని మంత్రి తలసాని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement