Thursday, March 28, 2024

తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై కేసు..

తీన్మార్ మ‌ల్ల‌న్న‌పై ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. టీఆర్‌ఎస్ నేత‌ల‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఫిర్యాదు మేరకు తీన్మార్‌ మల్లన్నపై పలు సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల సోషల్‌ మీడియాలో తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్లారెడ్డిగూడకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు ఫయాజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవిరాజా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement