Tuesday, April 23, 2024

రేపు తాండూరులో కేర్‌ మెగా వైద్య శిభిరం..

తాండూరు, (ప్రభన్యూస్‌) : తాండూరు పట్టణం ఆదర్శనగర్‌లోని సాయితరుణ్‌ హస్పిటల్‌లో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటి కేర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డా.భరత్‌ పురోహిత్‌ ఆధ్వర్యంలో గుండె సంబధిత వ్యాధులు, డా.సయ్యద్‌ ఉస్మాన్‌ ఆధ్వర్యంలో నరాల సంబంధిత, మానసిక సమస్యలు, మెదడు, పక్షవాతం వ్యాధులకు, డా.సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధిత వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని వివరించారు.

మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement