Friday, March 29, 2024

కారు బీభత్సం… పలువురికి గాయాలు

న‌గ‌రంలోని పెద్దఅంబ‌ర్ పేట వ‌ద్ద కారు బీభ‌త్సం సృష్టించింది. తెల్ల‌వారు జామున ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు పాదచారులతోపాటు కారులో ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కారులో ప్రయాణిస్తున్న వారిని బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన వీరనారాయణ కుటుంబ సభ్యులగా పోలీసులు గుర్తించారు. ఒంగోలులో తమ బంధువుల చావుకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement