భూతగాదాల కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. కమ్మగూడలో భువనగిరికి చెందిన ఆవుల జార్జ్ అనే వ్యక్తిని ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు మట్టుబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -