Saturday, April 20, 2024

Breaking: రాంగోపాల్ పేటలో పేలుడు.. ఇద్దరికి తీవ్రగాయాలు

సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని న‌ల్ల‌గుట్ట జే బ్లాక్‌లోని ఓ ఇంట్లో పేలుడు ఘటన చటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సిలిండ‌ర్ పేలుడు ధాటికి భ‌వ‌నం మొద‌టి అంత‌స్తు పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. పేలుడు సంభ‌వించిన‌ప్పుడు భారీ శ‌బ్దం రావ‌డంతో స్థానికులు ఉలిక్కిప‌డ్డారు. భయంతో ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. పేలుడు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement