Thursday, April 18, 2024

జ‌నాభా ఆధారంగా బిసిల‌కు బ‌డ్జెట్ కేటాయింపులు – బిజెపి

నాగోల్ – తాము అధికారంలోకి వ‌స్తే బీసీ జనాభా అధారంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని చేస్తామని తెలంగాణ‌ బీజేపీ ప్ర‌క‌టించింది. నాగోల్ లో నేడు జరిగిన బీసీ మోర్చా సభలో బీసీ డిక్లరేషన్ ను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రవేశపెట్టగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆమోదించారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని ఈ డిక్ల‌రేష‌న్ లో హామీ ఇచ్చింది. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే బీసీ విద్యార్థులందరికీ పరిమితి లేకుండా స్టాచ్చురేషన్ పద్దతిలో అందరికీ ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీపడలేని, గెలవలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,  కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్, ఆలే భాస్కర్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ ఓబీసీ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో ఓబీసీలు, బీజేపీ క్యాడర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపేట నుండి నాగోల్ వరకు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఓబీసీ సమ్మేళనం చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement