Saturday, April 20, 2024

HYD: ఏసీబీ వలలో బహదూర్ పుర ఎస్ఐ

హైదరాబాద్ లోని బహదూర్ పుర ఎస్ఐ శ్రవణ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు. రూ.8వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ శ్రవణ్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఓ కేసు విషయంలో ఎస్ఐ లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఎస్ఐ శ్రవణ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement