Friday, March 29, 2024

ఆటోమోటివ్‌ కియా, హైటెక్‌ సిటీ వద్ద ఈవీ 6ను ప్రదర్శిస్తోన్న కియా

కియా పూర్తి విద్యుత్‌ ఈవీ6 ను హైటెక్‌ సిటీ వద్దనున్న ఆటోమోటివ్‌ కియా వద్ద ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నటి క్యాథెరిన్‌, సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తో పాటుగా కియా ప్రతినిధులు రఘు, గౌతమ్‌, షోరూమ్‌ ప్రతినిధి చెన్న కేశవ– సీఓఓ, వరప్రసాద్‌- జీఎం పాల్గొన్నారు. ఈ వాహనాన్ని కొండాపూర్‌లో ఉన్న ఆటోమోటివ్‌ కియా, హైటెక్‌ సిటీ వద్ద ప్రదర్శిస్తున్నారు. మూడు లక్షల రూపాయల టోకెన్‌ మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాహనాన్ని ముందుగా బుక్‌ చేసుకోవచ్చు. భారతదేశంలో ప్రీమియం ఆఫరింగ్‌గా 2022లో 100 మంది వినియోదారులకు ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో ఈవీ6ను డెలివరీ చేయనున్నారు. ఈ వాహనాన్ని జూన్‌ 2022లో విడుదల చేయనున్నారు. ఈవీ 6 ఇండియా వెర్షన్‌లో 77.4 కిలోవాట్‌ హవర్‌ లిథయం అయాన్‌ బ్యాటరీ ఉంది. ఇది 229 పీఎస్‌ విద్యుత్‌ శక్తిని 2 డబ్ల్యుడీలో ఉత్పత్తి చేయడంతో పాటుగా ఏడబ్ల్యుడీ వేరియంట్‌లో 325పీఎస్‌ శక్తిని విడుదల చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 528 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణిస్తుంది. ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 5.2 సెకన్లలో అందుకుంటుందని ఆ సంస్థ తెలిపింది. కియా ఈవీ 6 వాహనం భారతదేశంలో ఐదు రంగులు – మూన్‌స్కేప్‌, స్నో వైట్‌ పెరల్‌, రన్‌వే రెడ్‌, అరోరా బ్లాక్‌ పెరల్‌, యాచ్‌ బ్లూ –లో లభిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement