Saturday, April 20, 2024

రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల డీడీలను సమర్పించేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్.. బండ్లగూడ, పోచారం టౌన్‌షిప్‌లో అందుబాటులో ఉన్న ఫ్లాట్‌లను ఫేజ్-IVలో లాటరీ ద్వారా కేటాయిస్తోంది. కాగా, టోకెన్ అడ్వాన్స్ డిమాండ్ డ్రాఫ్ట్ (డిడిలు) సబ్మిట్ చేసేందుకు చివరి తేదీ ఏప్రిల్ 15 వరకు పొడిగించబడింది.

ఆసక్తి గల దరఖాస్తుదారులు వరుసగా 2 BHK/1 BHK & 1 BHK సీనియర్ సిటిజన్ కోసం రూ.2 లక్షలు, రూ.1 లక్ష టోకెన్ అడ్వాన్స్‌గా చెల్లించాలి. ఇక డిడిని మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం, తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్, ఉర్దూగల్లి, స్ట్రీట్ నెం. 17. హిమాయత్‌నగర్, హైదరాబాద్‌లో ఏప్రిల్ 15 లేదా అంతకు ముందు సాయంత్రం 5 గంటల వరకు సమర్పించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement