Saturday, April 20, 2024

అంబేద్కర్‌ స్పూర్తితోనే కేసిఆర్‌ పాలన..

కవాడిగూడ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన సాగిస్తున్నారని ముషీరాబాద్‌ నియోజకవర్గం శాసనసభ్యులు ముఠా గోపాల్‌ అన్నారు. పేదరిక నిర్మూలనకు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్‌ ఎంతో కృషిచేశారని, ఆ విధంగానే ముఖ్యమంత్రి కేసిఆర్‌ వినూత్న పథకాలతో ముందుకు వెళ్ళుతున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్‌ 130వ జయంతి సందర్భంగా గాంధీనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేద ప్రజల అభ్యున్నతి సంక్షేమం కోసం పథకాలు చేపట్టి అమలు చేస్తున్నారని చెప్పారు, దళితులు, మైనారిటీలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఎనలేనిదని అన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినప్పటికి ఏలాంటి సమస్యలు రాకుండా పాలన అందిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు కరోనా నిర్మూలకు సహాకరించానలి ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు ముఠా జయసింహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement