Thursday, April 25, 2024

Air India : ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్..

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో ముంబై ఏయిర్ పోర్ట్ లో అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఏ320 విమానంలో ఒక్క‌సారిగా సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మ‌ళ్లించారు. విమానాన్ని ముంబై ఏయిర్ పోర్ట్ లో క్షేమంగా ల్యాండ్ చేయించామ‌న్నారు. విమానంలో 143 మంది ప్రయాణికులు ఉన్నారని, అంద‌రూ సురక్షితంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. విమానంలోని హైడ్రాలిక్‌ సిస్టంలో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement