Wednesday, April 17, 2024

హైదరాబాద్‌లో ఐనాక్స్‌ 4వ మల్లీప్లెక్స్‌ను ప్రారంభించిన‌ నటుడు అడవి శేష్‌

భారతదేశపు అగ్రగామి మల్టీప్లెక్స్‌ సంస్ధ ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌ (ఐనాక్స్‌) శుక్ర‌వారం హైదరాబాద్‌లో తమ 4వ మల్లీప్లెక్స్‌ను సత్వా నెక్లెస్‌ మాల్‌ వద్ద ప్రారంభించింది. ఈ మ‌ల్టీప్లెక్స్ ను న‌టుడు అడ‌విశేష్ ప్రారంభించారు. ఈ మాల్‌ కవాడీగూడా మెయిన్‌ రోడ్‌, సికింద్రాబాద్‌ వద్ద ఉంది. ఈ నూతన మల్టీప్లెక్స్‌లో 7 ఆకర్షణీయంగా డిజైన్డ్‌ ఆడిటోరియాలు ఉంటుంది. మొత్తంమ్మీద 1534 సీట్లు కలిగిన ఈ మల్టీప్లెక్స్‌లో 103 విలాసవంతమైన రీక్లైనర్‌ సీట్లు ఉన్నాయి. ఐనాక్స్‌ ఇప్పుడు నాలుగు మల్టీ ప్లెక్స్‌లను 26 స్ర్కీన్‌లతో హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. ఈ ప్రారంభం గురించి ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌ రీజనల్‌ డైరెక్టర్‌ సౌత్‌, మోహిత్‌ భార్గవ మాట్లాడుతూ… ఈ 7 స్ర్కీన్‌ సినిమా ఆధునిక విలాసం, అధునాతన సినిమా సాంకేతికతలు, సమృద్ధిగా రుచులను అందించే ఆహార ఎంపికలతో కూడిన అనుభవాలు అందిస్తుందన్నారు. సికింద్రాబాద్‌ పరిసరాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా గమ్యస్దానంగా ఇది మారనుందన్నారు. ముత్యాల నగరిలో త‌మ 4వ సినిమాను తెరవడం ద్వారా హైదరాబాద్‌లో అమిత ఆసక్తి కలిగిన సినీ అభిమానులను స్వాగతిస్తున్నామన్నారు. ఈ వినూత్న అనుభవాల ద్వారా వారికి ఆహ్లాదం పంచనున్నామ్నారు. ఈ స్ర్కీన్‌ల ప్రారంభంతో తెలంగాణాలో త‌మ కార్యకలాపాలు మరింత విస్తృతం చేయడం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement