వివేక్ నగర్, (ప్రభన్యూస్) : జంట నగరాలకు చెందిన ప్రముఖ కళా సంస్ధ రాగరాగిణి సాహితీ, సాంస్కృతిక సేవా సంస్ధ, శ్రీ త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు కళా సుబ్బారావు కళా వేదికలో ప్రముఖ గాయని విజయలక్ష్మి దేశికన్ జయంతి సందర్భంగా లలిత, భక్తి గీతాల గానగోష్టి జరుగుతుందని సంస్ధ వ్యవస్ధాపక అధ్యక్షురాలు, గాన కోకిల ఎం.వి.రమణకుమారి, ప్రధాన కార్యదర్శి ఎం.వి.సుబ్బలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా జరుగనున్న సభా కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు డాక్టర్ వోలేటి పార్వతీశం, డాక్టర్ మహాభాష్యం చిత్తరంజన్, కళా జనార్ధనమూర్తి వీరంతా అతిథులుగా పాల్గొంటారని వారు పేర్కొన్నారు. గాయని అమృత వల్లి నిర్వహణలో జరుగనున్న లలిత, భక్తి గీతాల గానగోష్టిలో బాల గాయణీమణులు గాయత్రి , వైష్ణవి, శ్రీనిధి, శ్రీ యాలహరి వీరంతా పలు లలిత, భక్తి గీతాలను ఆలపిస్తారని, ఎం.ఆనంద్ సభా కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరిస్తారని రమణకుమారి, సుబ్బలక్ష్మి వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..