Friday, March 29, 2024

కూక‌ట్‌ప‌ల్లి మెట్రో స్టేష‌న్ కింద కారులో మంట‌లు.. భారీగా ట్రాఫిక్ జామ్‌

హైద‌రాబాద్ : కూక‌ట్‌ప‌ల్లి మెట్రో స్టేష‌న్ కింద కారులో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. మంట‌ల్ని గ‌మ‌నించిన డ్రైవ‌ర్, మ‌రో వ్య‌క్తి కారు దిగారు. క్ష‌ణాల్లోనే కారంతా మంట‌లు వ్యాపించాయి. దీంతో వై జంక్ష‌న్ నుంచి మూసాపేట వైపు వాహ‌నాలు నెమ్మ‌దిగా క‌దులుతున్నాయి. కూక‌ట్‌ప‌ల్లి నుంచి మూసాపేట ఫ్లై ఓవ‌ర్ వ‌ర‌కు ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు. అగ్నిమాప‌క సిబ్బంది మంటల‌ను అదుపు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement