Thursday, April 25, 2024

తెలంగాణ‌లో కొత్తగా 7754 మందికి కరోనా… 51 మంది మృతి..

హైద‌రాబాద్ – రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల‌లో . కొత్తగా 7754 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులు కలుపుకుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,43,360కు చేరుకుంది. కరోనా నుంచి 6542 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 3,62,160కు చేరింది. ప్రస్తుతం 77,727 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 78,888 కరోనా నిర్ధారణా పరీక్షలు నిర్వహించారు. కిట్ల కొరత కారణంగా తక్కువ నిర్ధారణా పరీ క్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గత నాలుగు రోజు లుగా రోజూ 80వేల మేరనే టెస్టులు చేస్తున్నారు. కాగా,కరోనాతో మృ తి చెందుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. శుక్ర‌వారం నాడు మరో 51 మంది కరోనాతో మృతిచెందారు. రాష్ట్రంలో శుక్ర‌వారం నాటికి మొత్తం 2312 మంది కరోనాతో ప్రాణా లు విడిచారు.

జిల్లాల వారిగా కొత్త కేసుల వివ‌రాలు
జీహెచ్‌ఎంసీలో 1507కేసులు నమో దయ్యాయి. మేడ్చల్‌లో 630, రంగారెడ్డి 544, ఆదిలాబాద్ 109, భద్రాద్రి 108, జగిత్యాల 255, జనగామ 74, జయశంకర్‌ భూపాలపల్లి 73, జోగులాంబ గద్వాల 100, కామారెడ్డి 143, కరీంనగర్ 281, ఖమ్మం 230, కొమరంభీం ఆసీఫాబాద్ 101, మహబూబ్‌నగర్ 279, మహబూబాబాద్ 125, మంచిర్యాల 216, మెదక్ 106, ము లుగు 41, నాగర్‌కర్నూలు 203, నల్గొండ 231, నారాయణపేట 44, నిర్మల్ 86, నిజామాబాద్ 267, పెద్దపల్లి 162, రాజన్నసిరిసిల్ల 102, సంగారెడ్డి 325, సిద్ధిపేట 279, సూర్యాపేట 242, వికారాబాద్ 242, వనపర్తి 103, వరంగల్‌ రూరల్ 165, వరంగల్‌ అర్బన్ 208, యాదాద్రి భువనగిరి 173 కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement