Thursday, April 25, 2024

హైద‌రాబాద్ లో దారుణం – ఇంటిలోకి చొర‌బ‌డి యువ‌తిపై అత్యాచారం..

హైద‌రాబాద్ న‌డిబొడ్డులో దారుణం జ‌రిగింది.. ఇంటిలో ఒంట‌రిగా ఉంటున్న యువ‌తిపై దుండ‌గులు అత్యాచారం చేశారు.. ఈ సంఘ‌ట‌న పంజాగుట్ట, డీఎస్‌ మక్తాలో క‌ల‌క‌లం చెల‌రేగింది. వివ‌రాల్లోకి వెళ్తే ఇంటి‌ కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు వెళ్లగా ఒక యువ‌తి ఒంట‌రిగా ఇంట్లోనే ఉంటోంది. ఈ విష‌యాన్ని గుర్తించిన ఇద్ద‌రు వ్య‌క్తులు మంగ‌ళ‌వారం సాయంత్రం ఆమె ఇంటికి వ‌చ్చి, తాము బ్యాంకు ఉద్యోగుల‌మ‌ని పరిచయం చేసుకున్నారు. తర్వాత తమ బ్యాంకు నుంచి ఫైనాన్స్‌ ఇస్తామని యువతితో మాట‌లు క‌లిపారు. అనంత‌రం వారిలో ఓ వ్యక్తి ఇంటి బయటకు వెళ్లి కాపలా ఉన్నాడు. మరో వ్యక్తి ఇంట్లో యువతితో మాట్లాడుతూ ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంత‌రం ఈ ఘటనపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుప‌త్రికి తరలించారు. కేసు న‌మోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement