Friday, April 19, 2024

హైదరాబాద్ నుంచి మ‌రో టీకా

హైదరాబాద్‌, : కరోనా మహమ్మారి ప్రజలపై పగబడుతున్న వేళ హైదరాబాద్‌ నగరం నుంచి మరో కరోనా టీకా రాబోతోంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయో టెక్‌ సంస్థ కో వాగ్జిన్‌ అభివృద్ధి చేసి ప్రపం చానికందించగా త్వరలో నగరానికి చెందిన మరో కంపెనీ బయోలాజికల్‌ – ఇ కంపెనీ నుంచి కొత్త టీకా రానుంది. బయోలాజికల్‌- ఇ త్వరలోనే మూడవ దశ ట్రయల్స్‌ ప్రారంభించి ఆగస్టు నుంచి వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయనుంది. ఆగస్టు నుంచి నెలకు 75 మిలియన్ల నుంచి 80 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ మహిమా దాట్ల తెలిపారు. హూస్టన్‌లోని బేలర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌, డైనవాస్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌తో బయోలాజికల్‌ కంపెనీ ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయనుంది. గత నెల చివర్లో మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి డ్రగ్‌ రెగ్యులేటర్‌ నుంచి అనుమతి పొందింది. గతేడాది నవంబర్‌ లోనే బయోలాజికల్‌ కరోనా వ్యాక్సిన్‌ తొలి, రెండవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టింది. మొత్తం 360 మంది ఆరోగ్య వంతులైన వాలం టీర్లపై ప్రయోగాలు జరిపినట్లు సంస్థ తెలిపింది. ఇక మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ దేశంలోని 15 ప్రాంతాల్లోచేపట్టనుంది.
ఈ ట్రయల్స్‌ 18 నుంచి 80 సంవత్సరాల వయసు మధ్య వారికి వ్యాధి నుంచి రక్షణ కోసం రోగ నిరోధక శక్తి భద్రతను అంచనా వేస్తాయి. బయోలాజికల్‌ మొదటి డోసు వేసుకున్న తర్వాత 28 రోజులకు రెండవ డోసు వేసుకోవాలి. టీకా ట్రయల్స్‌ సురక్షితమైనవి, సమర్ధవంతమైనవిగా తేలినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ టీకా అందుబా టులోకి వస్తే పేద, మధ్య తరగతి దేశాలకు పెద్ద ఊరట లభిస్తుందని టెక్సాస్‌ మెడికల్‌ కాలేజీ అసోసియేటెడ్‌ డీన్‌ డాక్టర్‌ మరియా ఎలెనా తెలిపారు. అలాగే బయోలా జికల్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement