Tuesday, April 16, 2024

Huzurabad: వారి అహంకారం అణిచేలా తీర్పు.. కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఐదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1,825 ఓట్ల లీడ్ సాధించారు. ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… హుజూరాబాద్ లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచేది బీజేపీనే అని తాము ముందు నుంచే చెబుతున్నామ‌న్నారు. డబ్బు, అధికారంతో ఎన్నికను గెలవాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు దిమ్మతిరిగే సమాధానం చెప్పారని సంజయ్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ అహంకారాన్ని అణిచేలా ప్రజలు ఓట్లు వేశారని బండి సంజ‌య్ చెప్పారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ పూర్తిగా కోల్పోయారని… ఆయనను జనాలు నమ్మడం లేదన్నారు. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారని, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారని, ఒక్కో దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తామని అన్నారని… వీటిలో ఏ ఒక్కటి చేయలేదని అందుకే కేసీఆర్ పై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement