Sunday, March 24, 2024

భార్య‌ను గొడ్డ‌లితో న‌రికి, ప‌సికందుని స్లంప్ లో ప‌డేసి….

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అనాజ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ కీచ‌క భ‌ర్త భార్యను గొడ్డలితో నరికి చంపి, 3 నెలల కుమారుడిని నీటి సంపులో పడవేసి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండరావిరాలకు చెందిన లావణ్యకు అనాజ్ పూర్ కి చెందిన ధనరాజ్‌తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బాలింతగా ఉన్న లావణ్య(23)ను బుధవారం మధ్యాహ్నం తన పుట్టింటి నుంచి నిద్ర చేయడం కోసం భర్త ధనరాజ్‌ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన కాసేపటికే భార్యతో గొడవపడిన ధనరాజ్‌ ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత 3 నెలల కుమారుడిని సంపులో పడేసి హతమార్చాడు. తల్లితో గొడవకు దిగిన తండ్రిని చూసి భయపడిన మూడేళ్ల కుమార్తె ఆద్య ఇంటి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. ఇద్ద‌ర్ని హ‌త్య చేసిన‌ నిందితుడు పరార‌య్యాడు.. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement