Thursday, April 25, 2024

అనుమానం… భార్యపై గొడ్డలితో దాడి..

భూపాలపల్లి, (ప్రభ న్యూస్): అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్య పై గొడ్డలితో దాడి చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావు పేటలో జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గంపల మొగిలి అత‌ని భార్య అయిన శ్యామ‌ల‌ను కొంత కాలంగా అనుమానిస్తున్నాడు. గతంలో రెండుసార్లు కత్తితో కూడా ఆమెపై దాడి చేశాడు.

అనంతరం కుల పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. సజావుగా జ‌రుగున్న క్రమంలో ఆదివారం మ‌ధ్యాహ్నం శ్యామలపై మొగిలి మరోసారి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. చెంప పైభాగంలో కంటి సమీపంలో రెండు చోట్ల గొడ్డలి వేటు పడింది. దీంతో ఒకవైపు పండ్లు అక్కడే ఊడిపడ్డాయి. కడుపు భాగంలో కూడా గొడ్డలితో నరకడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

స్థానికులు వెంటనే 108 వాహనంలో శ్యామలను ములుగు ఏరియా ఆస్ప‌త్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వ‌రంగ‌ల్‌లోని ఎంజీఎం కు తీసుకు వెళ్లాల్సిందిగా డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం శ్యామల ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు డాక్ట‌ర్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement