Thursday, April 18, 2024

నార్సింగిలో కారు బీభత్సం.. బైక్ పైకి దూసుకెళ్ల‌డంతో భార్యభర్తలు మృతి..

హైద‌రాబాద్‌లోని నార్సింగిలో కారు బీభత్సం సృష్టించింది. నార్సింగిలోని ఎంజీఐటీ వద్ద ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో TS07EZ6395 నెంబర్ గల బైక్ పై వెళ్తున్న దంపతులు ఘటనా స్థలంలోనే చ‌నిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కారు న‌డిపిన సంజీవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఉండ‌డం. స్పీడ్‌గా కారు న‌డ‌ప‌డంతోనే ఈ ప్రమాదం జరిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంజీవ్‌కు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో 148ఎంజీ వ‌చ్చిన‌ట్టు తెలిపారు. కాగా, సోమ‌వారం తెల్లవారుజామున బంజారాహిల్స్ లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కూడా మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే కారణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement