Saturday, April 20, 2024

కాంగ్రెస్ నేత భూప‌తిరెడ్డికి స‌న్మానం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125వ‌ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, బేకరీ గడ్డ మస్జీద్ దగ్గర నమాజ్ చేయడానికి ఇబ్బందిగా ఉందని, అక్కడి ముస్లిం మైనారిటీ సోదరులు తెలియజేయడంతో వెంటనే స్పందించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి వెంటనే తన సొంత నిధులతో సీసీ రోడ్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా మైనారిటీ సోదరుల పిలుపు మేరకు ఈరోజు నమాజ్ కార్యక్రమం తరువాత కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డిని సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ… కాలనీలో కానీ, నియోజకవర్గ స్థాయిలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, సాధ్యమైనంత మేరకు మంచి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి వెనకడుగు వేయనని తెలిపారు. ఈకార్యక్రమంలో మిద్దెల సీతారాం రెడ్డి, ఖాజా భాయ్, మజీద్- ఏ- Asra- ప్రెసిడెంట్ మహమ్మద్ లతీఫ్, జనరల్ సెక్రెటరీ సయ్యద్ ఖాదీర్, జాయింట్ సెక్రటరీ షైక్ శంషీర్ షైక్ జలాల్, మహమ్మద్ గఫ్ఫార్, రహీం ఖాన్, పెద్దసంఖ్యలో మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement