తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో పలుచోట్ల దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీని ప్రభావం యాదాద్రిపై పడింది. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాలను పొగమంచు కమ్మేసింది. ప్రధానాలయం సహా రహదారులు మంచుతో కప్పుకున్నాయి. దారులన్నింటిని మంచు అలుముకోవడంతో భక్తులు, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..