Tuesday, April 16, 2024

భారీగా రేష‌న్ బియ్యం పట్టివేత.. రైస్ మిల్లులో లారీతో సహా పట్టుకున్న పోలీసులు

అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ (రేష‌న్‌) రైస్ ను పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లా కేంద్రం, కూనారం రోడ్ లో గల రైస్ మిల్లు లో సుమారు 400 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను పెద్దపల్లి ఎస్సై రాజేష్ స్వాధీనం చేసుకున్నారు.

సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించాలని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేషన్ షాపుల ద్వారా నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం పక్కదారి పట్టడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement