Saturday, April 20, 2024

నర్సింగ్ కాలేజ్ బస్సు ప్రమాదంపై స్పందించిన‌ హరీష్‌రావు..

ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఈరోజు ఉద‌యం నల్గొండ జిల్లాలో జ‌రిగిన‌ ప్రైవేటు నర్సింగ్ కాలేజ్ బస్సు ప్రమాద ఘటనపై స్పందించారు. ఘటన జరిగిన విషయం తెలియగానే అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని మంత్రికి వైద్యాధికారులు వివరించారు. గాయపడ్డ విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యుల‌ను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement