Friday, March 29, 2024

బాలిక‌పై జిమ్ ట్రైనర్ అఘాయిత్యం.. హైద‌రాబాద్ జీడిమెట్ల‌లో ఘ‌ట‌న‌

కుత్భుల్లాపూర్ క్రైమ్ (ప్రభ న్యూస్) : పదోతరగతి చదువుతున్న ఓ బాలికపై జిమ్ ట్రైనర్ అత్యాచారం చేసిన ఘటన హైద‌రాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని జ‌రిగింది. నెహ్రూన‌గ‌ర్‌కి చెందిన బాలిక ప‌దో త‌ర‌గ‌తి చ‌ద‌వుతోంది. ఇంటి స‌మీపంలోని విశ్వ (23) జిమ్ ట్రైన‌ర్‌గా కొంతకాలంగా ఆమెతో చ‌నువుగా ఉంటున్నాడు. గ‌త నెల 29న ఆమెను ఇంటి నుంచి తీసుకొని వెళ్లిపోయాడు.

అదే రోజు కుటుంబ స‌భ్యులు మిస్సింగ్ అయిన‌ట్టు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీష్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడు శుక్రవారం రాత్రి బాలికను హైద‌రాబాద్ తీసుకొచ్చాడు. నెహ్రూనగర్ లోని బాలిక‌ ఇంటి వ‌ద్ద వ‌దిలేసి వెళ్లాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుక్ర‌వారం రాత్రి నిందితుడిని అరెస్టు చేసి, శ‌నివారం రిమాండ్‌కి త‌ర‌లించినట్లు తెలిపారు. నిందితుడిపై అత్యాచారం, పొక్సో చట్టం కింద కేసు న‌మోదు చేసినట్లు జీడిమెట్ల సిఐ పవన్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement