Thursday, April 25, 2024

జూన్ 5 నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్స్ – టైం టేబుల్ విడుద‌ల‌

హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వచ్చే జూన్‌ నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు.. ఈ ఎగ్జామ్స్ జూన్‌ 5 నుంచి 12 వరకు కొనసాగుతాయి.. ఆదివారం రావడంతో 11వ తేది ప‌రీక్ష నిర్వ‌హించ‌డం లేదు..ఇక గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలు ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ భాషల్లో జరుగుతాయని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.

జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ మినహా మిగతా అన్ని పేపర్‌లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని పేర్కొంది. కాగా, గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే, గ్రూప్‌-1 ద్వారా మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్‌పీఎస్‌సీ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేసింది. అంటే ప్రిలిమ్స్‌కు హాజరైన వారి నుంచి 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement