Thursday, March 28, 2024

అగ్నిప్రమాదాలను పట్టించుకోని ప్రభుత్వం.. కిషన్ రెడ్డి

నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు. తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కిషన్ రెడ్డి కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. దట్టంగా అలుముకున్న పొగతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. వెంటనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. బస్తీవాసుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసి కి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అలా అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయడం సరైనది కాదన్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు కారణం అక్రమ నిర్మాణాలేనన్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రమాదాలు అక్రమ నిర్మాణాల్లోనే జరిగాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement