Wednesday, March 27, 2024

రైతుల‌తో రాజ‌కీయ క్రీడ ఆడుతున్న ప్ర‌భుత్వాలు : భ‌ట్టి విక్ర‌మార్క

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయని, కార్పొరేట్ లకు భూముల అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కర్షకులకు అండగా కాంగ్రెస్‌ అంటూ కాంగ్రెస్‌ పార్టీ వరి దీక్షలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయ‌న్నారు. రైతుల‌ను ఈ ప్ర‌భుత్వాలు ద‌గా చేస్తున్నాయ‌న్నారు.

ధాన్యం కొనుగోలు చేయకపోతే యుద్ధం తప్పదని భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో వరి రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యపు రాశులతో కల్లాలు నిండిపోయాయని, పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement