Friday, March 29, 2024

ఎన‌ర్జీ క‌న్జ‌ర్వేష‌న్ లో ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు అద్భుతం : గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

ఎనర్జీ కన్జర్వేషన్‌లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అద్భుతమని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ అన్నారు. హైటెక్స్‌లో తెలంగాణ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డ్స్‌-2021 కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం గ్రీనరీతోపాటు గ్రీన్‌ ఎనర్జీలో కూడా ముందుందని గవర్నర్‌ అన్నారు. విద్యుత్‌ను మన ఇంటి నుంచే పొదుపు చేయడం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తిలో రాష్ట్రం ముందుకెళ్తుంద‌న్నారు. సోలార్‌ ఎనర్జీ ద్వారా ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతున్నదని చెప్పారు. యువతతోపాటు ప్రతి ఒక్కరు విద్యుత్‌ను పొదుపు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి, రెడ్కో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement