Thursday, April 25, 2024

స‌త్య‌నాదెళ్ల‌తో భేటీ అయిన కేటీఆర్.. ఫొటోలు పోస్ట్ చేసిన మంత్రి

తెలంగాణ మంత్రి కేటీఆర్ ..ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత టెక్ దిగ్గ‌జం మైక్రోసాప్ట్ కార్పొరేషన్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. కాగా స‌త్య నాదెళ్ల‌ భారత పర్యటనలో ఉన్నారు. ఈ మేర‌కు హైదరాబాద్ కు వచ్చిన ఆయనతో కేటీఆర్ స్నేహపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ తెలిపారు. ఇద్దరు హైదరాబాదీల కలయికతో ఈరోజు గొప్పగా ప్రారంభమయిందని ఆయన అన్నారు. బిజినెస్, బిర్యానీ గురించి మాట్లాడుకున్నామని తెలిపారు. సత్య నాదెళ్ల హైదరాబాద్ లోనే పెరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, హైదరాబాద్ లో అవకాశాలు తదితర అంశాలను సత్య నాదెళ్లకు కేటీఆర్ వివరించినట్టు సమాచారం. లేటెస్ట్ టెక్నాలజీపై కూడా ఇరువురూ చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement