Tuesday, April 23, 2024

Telangana | క్రైస్తవులకు గుడ్ న్యూస్‌.. క్రిస్టియన్ భవన నిర్మాణానికి భూమి కేటాయించిన ప్ర‌భుత్వం

క్రైస్తవ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రానున్న క్రిస్మస్ కు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నవేడుకల సందర్భంగా క్రిస్టియన్ వర్గాల ప్రతినిధులు, అధికారులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఈనెల 21లేదా 22 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీలో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం క్రిస్టియన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. మంత్రి కేటీఆర్ చే క్రిస్మస్ కి ముందే ఉప్పల్ బాగయత్ పరిధిలో 2 ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి ఈశ్వర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా క్రిస్మస్ పర్వదిన పురస్కరించుకొని ఇప్పటికే జిల్లాల పరిధిలో క్రైస్తవ మహిళలకు పంపిణీ చేయనున్న దుస్తులను రిలీజ్ చేశారు. సందర్భంగా క్రిస్మస్ శాంపిల్ కేకు ను మంత్రి కొప్పుల ఈశ్వర్ కట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement